తేనెటీగల దాడిలో ఉపాధి కూలీ మృతి
ABN , First Publish Date - 2022-05-20T05:58:48+05:30 IST
తేనెటీగల దాడిలో ఉపాధి కూలీ మృతి చెందాడు.
సత్యవేడు మే 19: : తేనెటీగల దాడిలో ఉపాధి కూలీ మృతి చెందాడు. ఏపీవో భాస్కరయ్య, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని పెద్దఈటి పాకం పంచాయతీ రాచపాళెం దళితవాడకు చెందిన ఎస్.నాగయ్య (50) రెండు రోజుల క్రితం గ్రామంలో ఉపాధి పనుల్లో భాగంగా కాలువ పూడికతీత పనులు చేస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. అప్పటి నుంచి తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.