మామిడికాయల ట్రాక్టర్ బోల్తా - కూలీ మృతి
ABN , First Publish Date - 2021-06-19T04:52:24+05:30 IST
మామిడికాయల ట్రాక్టర్ బోల్తాపడి కూలీ మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం జరిగింది.
కేవీపల్లె, జూన్ 18: మామిడికాయల ట్రాక్టర్ బోల్తాపడి కూలీ మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ రామ్మోహన్ కథనం.. ఎర్రావారిపాళెం మండలం ఎల్లమంద పంచాయితీకి చెందిన భారతయ్య(60) అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి కేవీపల్లె మండలం వడ్లకుంట పంచాయతీ కొత్తపల్లె వద్ద మామిడి కాయలు కోయడానికి వచ్చారు. సాయంత్రం ట్రాక్టర్కు మామిడి కాయలు లోడ్ చేసిన అనంతరం ఎల్లమందకు బయలు దేరారు. కొంతదూరం వెళ్లగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్ రమణయ్య పక్కన కూర్చుని ఉన్న భారతయ్య సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ట్రాలీలో కూర్చుని ఉన్న మరో ఇద్దరు అప్రమత్తమై కిందకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఎస్ఐ తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ రమణయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.