దేశం కరోనా పీక్ స్టేజ్‌ను దాటేసిందా?... గణనీయంగా తగ్గుతున్న కేసులు!

ABN , First Publish Date - 2020-09-29T17:05:51+05:30 IST

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే గడచిన 13 రోజుల కరోనా కేసుల గణాంకాలను పరిశీలిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. కేసులు తగ్గుముఖం...

దేశం కరోనా పీక్ స్టేజ్‌ను దాటేసిందా?... గణనీయంగా తగ్గుతున్న కేసులు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే గడచిన 13 రోజుల కరోనా కేసుల గణాంకాలను పరిశీలిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. కేసులు తగ్గుముఖం పడుతుండటమే దీనికి ప్రధాన కారణం. సెప్టెంబరు 17న భారత్‌లో 93,199 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే రోజువారీ కరోనా కేసుల నమోదులో ఇదే అతిపెద్ద సంఖ్య. ఆ తరువాత కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చి, ప్రస్తుతం 70,589కి చేరుకుంది. దీనికిముందు కూడా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీనిని చూస్తుంటే దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నదనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఇదేవిధంగా కేసులు గణనీయంగా తగ్గి, కొద్దిరోజుల్లోనే తిరిగి పెరిగిపోయాయి. 


Updated Date - 2020-09-29T17:05:51+05:30 IST