డాడీ... డాడీ... ఇటు చూడు!

ABN , First Publish Date - 2022-08-07T08:04:58+05:30 IST

డాడీ... డాడీ... ఇటు చూడు!

డాడీ... డాడీ... ఇటు చూడు!

కోర్టుకు ‘కోనసీమ’ అల్లర్ల నిందితులు... భావోద్వేగ దృశ్యాలు



అమలాపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ‘కోనసీమ జిల్లా’ అల్లర్ల కేసులో నిందితులను చూసేందుకు వారి కుటుంబసభ్యులు అమలాపురం రెండో అదనపు కోర్టు వద్దకు భారీగా పోటెత్తారు. కేసుపెట్టి రిమాండ్‌కు పంపిన రెండునెలల తర్వాత తొలిసారి వాయిదా కోసం కోర్టుకు తీసుకురావడంతో.. తమ వారిని  చూసి, అవసరాలు తెలుసుకోడానికి  వందలాదిమంది తరలివచ్చారు. కోర్టు గేట్లను పట్టుకుని ‘డాడీ.. డాడీ’ అంటూ చిన్నారులు రోదించారు. కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదంపై మే 24వ తేదీన అమలాపురంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులోని 74 మందిని  మూడు బస్సుల్లో రాజమహేంద్రవరం, కాకినాడ జైళ్ల నుంచి కోర్టుకు పోలీసు బందోబస్తు నడుమ సాయంత్రం తీసుకువచ్చారు. తీసుకురాగానే నిందితులను సరాసరి కోర్టు లోపలకు తీసుకెళ్లారు. తిరిగి అర్ధరాత్రి 11 గంటలకు బస్సుల్లో వారిని జైళ్లకు తరలించారు. తమవారిని కోర్టుకు తెచ్చిన సమాచారం తెలిసి భారీగా కుటుంబసభ్యులు అక్కడకు చేరుకున్నారు. అప్రమత్తమైన సిబ్బంది... కోర్టు రెండు గేట్లను మూసివేశారు. దీంతో తమ వారు బయటకు వస్తే చూడాలని, మాట్లాడాలని కుటుంబసభ్యులు గంటలతరబడి రోడ్డుపైనే నిరీక్షించారు. చిన్నారులైతే కోర్టు గేటులోంచి తమ తండ్రులను చూసి తీవ్ర స్వరంతో రోదిస్తూ కేకలువేసిన తీరు కంటతడి పెట్టించింది. 

Updated Date - 2022-08-07T08:04:58+05:30 IST