ధాన్యం బకాయిలు చెల్లించాలని బీజేపీ ధర్నా
ABN , First Publish Date - 2022-07-08T03:19:59+05:30 IST
ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరుతూ మండల బీజేపీ అధ్యక్షుడు మారెళ్ళ బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు
జలదంకి, జూలై7: ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరుతూ మండల బీజేపీ అధ్యక్షుడు మారెళ్ళ బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ రైతుసంక్షేమంలో మమ్మల్ని మించినవారు ఇంకెవరూ లేరని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ క్షేత్రస్థాయిలో రైతులు సమస్యలతో అల్లాడిపోతున్నారని అన్నారు. నాలుగు నెలల నుంచి ధాన్యం డబ్బులు రాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు. తక్షణమే ధాన్యం బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కిసాన్మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యుడు చల్లా హనుమారెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శ్రీనాఽథ్రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ముడి కిషోర్రెడ్డి, వంటేరు రాకేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.