సిలిండర్కు దండం పెట్టు... బీజేపీని బొంద పెట్టు: హరీష్రావు
ABN , First Publish Date - 2021-10-19T01:25:07+05:30 IST
మహిళలందరూ ఈ నెల 30న ఓటు వేసేందుకు వెళ్లే ముందు సిలిండర్కు దండం పెట్టి.. బీజేపీని బొంద పెట్టాలని మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు.
హుజూరాబాద్: మహిళలందరూ ఈ నెల 30న ఓటు వేసేందుకు వెళ్లే ముందు సిలిండర్కు దండం పెట్టి.. బీజేపీని బొంద పెట్టాలని మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని కనుకులగిద్దె, జూపాక, బొత్తలపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ రెచ్చగొట్టే మాటలకు, సెంటిమెంట్ మాటలకు ఓటు వేస్తే నష్టపోతామని హెచ్చరించారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ తన స్వార్థం కోసం రాజీనామా చేశారని, తాను అంటించుకున్న బురదను అందరికి పూసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామని హరీష్రావు తెలిపారు.