తౌక్టే తుపాన్ ఎఫెక్ట్...గుజరాత్‌లో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-05-18T18:14:21+05:30 IST

తౌక్టే తుపాన్ విపత్తు వల్ల గుజరాత్ రాష్ట్రంలో ముగ్గురు మరణించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంగళవారం...

తౌక్టే తుపాన్ ఎఫెక్ట్...గుజరాత్‌లో ముగ్గురి మృతి

గాంధీనగర్ : తౌక్టే తుపాన్ విపత్తు వల్ల గుజరాత్ రాష్ట్రంలో ముగ్గురు మరణించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంగళవారం చెప్పారు. తౌక్టే తుపానుపై మంగళవారం సీఎం విజయ్ రూపానీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గుజరాత్ రాష్ట్రంలోని 14 సముద్రతీర జిల్లాలు తుపాన్ వల్ల దెబ్బతిన్నాయని సీఎం చెప్పారు. 16,500 గుడిసెలు, 40వేల చెట్లు కూలిపోయాయని సీఎం చెప్పారు. వచ్చే మూడు గంటల్లో సురేంద్రనగర్ కు 10 కిలోమీటర్ల దూరంలోని అమ్రేలి వద్ద తుపాన్ బలహీనపడి తీరం దాటుతుందని సీఎం పేర్కొన్నారు. తౌక్టే తుపాన్ పీడిత ప్రాంతాల్లో తాము సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టామని సీఎం చెప్పారు. 

Updated Date - 2021-05-18T18:14:21+05:30 IST