కారు ఢీకొని సైకిలిస్టు మృతి

ABN , First Publish Date - 2021-10-19T06:07:13+05:30 IST

కారు ఢీకొని ఓ సైకిలిస్టు మృతి చెందాడు.

కారు ఢీకొని సైకిలిస్టు మృతి
శివారెడ్డి

పుంగనూరు రూరల్‌, అక్టోబరు18: కారు ఢీకొని ఓ సైకిలిస్టు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం పుంగనూరు సమీపంలో జరిగింది. మండలంలోని పాళ్యంపల్లెకు చెందిన శివారెడ్డి(53) సైకిల్‌పై పుంగనూరుకు వెళుతుండగా మదనపల్లె వైపు నుంచి వచ్చిన కారు అదుపు తప్పి సైకిల్‌ను ఢీకొనడంతో శివారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 




Updated Date - 2021-10-19T06:07:13+05:30 IST