భారత్‌ను చుట్టేందుకు సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2021-03-07T07:18:55+05:30 IST

‘క్లీన్‌ఇండియా- గ్రీన్‌ఇండియా’ నినాదంతో రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు సైకిల్‌పై భారతదేశ యాత్ర ప్రారంభించారు.

భారత్‌ను చుట్టేందుకు సైకిల్‌ యాత్ర
తాళ్లూరు చేరుకున్న రాజస్థాన్‌ యువకుడు

తాళ్లూరు, మార్చి 6 : ‘క్లీన్‌ఇండియా- గ్రీన్‌ఇండియా’ నినాదంతో రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు సైకిల్‌పై భారతదేశ యాత్ర ప్రారంభించారు. శనివారం తాళ్లూరుకు చేరుకున్నాడు. రాజస్థాన్‌ రాష్ట్రం సురోత్‌ గ్రామానికి చెందిన మురిసూధన్‌ పర్వాన్‌ 45 రోజుల క్రితం సైకిల్‌పై భారత్‌ యాత్ర చేపట్టారు. ఇప్పటి వరకు 12 రాష్ట్రాల్లో యాత్ర జరిగిందని ఆ యువకుడు తెలిపారు. 3 నెలలో భారత్‌లో అన్ని జిల్లాల్లో యాత్ర పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అపరిశుభ్రత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు.

Updated Date - 2021-03-07T07:18:55+05:30 IST