కరోనా మందు..మీకే ముందు: నేరగాళ్ల ఫోన్లు

ABN , First Publish Date - 2020-11-29T06:23:05+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు కరోనా వ్యాక్సిన్‌ను కూడా వదలడం లేదు! వ్యాక్సిన్‌ రాబోతుందని, ముందు మీకే ఇస్తామంటూ ప్రజలకు మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. వెంటనే కొంత మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని

కరోనా మందు..మీకే ముందు: నేరగాళ్ల ఫోన్లు

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు కరోనా వ్యాక్సిన్‌ను కూడా వదలడం లేదు! వ్యాక్సిన్‌ రాబోతుందని, ముందు మీకే ఇస్తామంటూ ప్రజలకు మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. వెంటనే కొంత మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని చెబుతున్నారు. ఈ తరహా ఫోన్లు ఇతర రాష్ట్రాలతోపాటు మన దగ్గర ఎక్కువగా వస్తున్నట్లు సైబర్‌ క్రైం పోలీ్‌సలు గుర్తించారు. కరోనా వ్యాక్సిన్‌ పేరుతో వచ్చే మెసేజ్‌లు, ఫోన్లను నమ్మి మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  

Updated Date - 2020-11-29T06:23:05+05:30 IST