తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును చేధించిన సైబరాబాద్ పోలీసులు
ABN , First Publish Date - 2021-01-23T14:48:40+05:30 IST
తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. తమిళనాడు రాష్ట్రంలో గల హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ జరిగింది.
హైదరాబాద్: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. తమిళనాడు రాష్ట్రంలో గల హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ జరిగింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు దోపిడీ దొంగలను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుంచి హైదరాబాద్, కర్ణాటకకు పారిపోయేందుకు దోపిడీదారులు ప్రయత్నించారు. కాగా సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దోపిడీ దొంగలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో చోరీ చేసిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, తెలంగాణ మీదుగా కర్ణాటక పారిపోయేందుకు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ దొంగలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.