సంఘ వ్యతిరేక శక్తులపై బైండోవర్‌ కేసులు

ABN , First Publish Date - 2022-05-11T17:26:35+05:30 IST

సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

సంఘ వ్యతిరేక శక్తులపై బైండోవర్‌ కేసులు

హైదరాబాద్‌ సిటీ: సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు రౌడీషీటర్లను మంగళవారం కమిషనరేట్‌కు పిలిపించి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ. లక్ష జరిమానా, 6 నెలల జైలు శిక్షతోపాటు మళ్లీ బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీ క్రైం కలమేశ్వర్‌ సింగన్‌వార్‌, ఏడీసీపీ నరసింహారెడ్డి, ఏసీపీలు రవిచంద్ర, శ్యాంబాబులతోపాటు పలువురు ఇన్‌స్పెక్టర్‌లు పాల్గొన్నారు.

Read more