బాలానగర్‌ స్టేషన్‌లో సీపీ ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2022-05-11T16:43:05+05:30 IST

బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11.30 గంటల సమయంలో బాలానగర్‌

బాలానగర్‌ స్టేషన్‌లో సీపీ ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్/బాలానగర్‌: బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11.30 గంటల సమయంలో బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న ఆయన పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్‌ రికార్డులు, పాత నేరస్తులు, రైడీ షీటర్ల జాబితా, పెట్రోమొబైల్‌, క్రైం టీం, టెక్‌టీంల పనితీరుపై ఆరా తీశారు. బాలానగర్‌లో రోజురోజుకూ సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, గంజాయి వ్యాపారం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని అరికట్టే విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ నిర్మూలించడంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మహిళా పోలీసులకు గానీ సిబ్బందికి గానీ ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సీపీ సూచించారు. సీపీ వెంట బాలానగర్‌ డీసీపీ సందీప్‌, బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తం ఉండగా సీపీకి బాలానగర్‌ సీఐ యం.డి వహీదుద్దీన్‌ పోలీ్‌సస్టేషన్‌ పనితీరును వివరించారు.

Read more