కర్నూలు జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
ABN , First Publish Date - 2020-09-20T15:42:30+05:30 IST
పోలీసుల పేరుతో ఫేస్బుక్లో సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు.
కర్నూలు: పోలీసుల పేరుతో ఫేస్బుక్లో సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. కర్నూలు జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముగ్గురు ఎస్ఐల ఫొటోలతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరిచారు. ఆయా ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు పలువురిని డబ్బలు అడిగారు. తమ అకౌంట్లకు డబ్బులు పంపాలంటూ మెస్సేజ్లు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చే సందేశాలకు ఎవరూ స్పందించవద్దని పోలీసులు హెచ్చరించారు.