హైదరాబాద్ సీపీగా రావడం సంతోషంగా ఉంది: సీవీ ఆనంద్
ABN , First Publish Date - 2021-12-25T18:02:00+05:30 IST
హైదరాబాద్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు సీవీ ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
హైదరాబాద్ : హైదరాబాద్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు సీవీ ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ కమిషనర్గా రావడం సంతోషంగా ఉందన్నారు. మెట్రోపాలిటన్ సిటీలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉంటున్నారు. సైబరాబాద్ సీపీగా కొనసాగినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతల మీద సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రత మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. డీసీపీగా 2001 నుంచి పనిచేశాను. అడిషనల్ సీపీ ట్రాఫిక్గా పనిచేశాను. సైబర్ క్రైమ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. సైబర్ క్రైమ్పై ప్రత్యేక దృష్టి సారిస్తాము. డ్రగ్స్పై అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. మహిళల భద్రత మీద ఎక్కువగా దృష్టి సారిస్తాం. గత నాలుగు సంవత్సరాల నుంచి సెంట్రల్ డిప్యుటేషన్లో వెళ్లి వచ్చాను. నూతన సంవత్సర వేడుకల విషయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం’’ అని పేర్కొన్నారు.