ధాన్యం డబ్బుల చెల్లింపుల్లో కోత
ABN , First Publish Date - 2021-07-25T05:37:01+05:30 IST
తాము అమ్మిన ధాన్యం కంటే తక్కువగా డబ్బులు అకౌంట్లలో జమ అవుతాయన్నాయని గుర్తించిన రైతులు నాంపల్లి మండలకేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట శనివారం అర్ధనగ్న ఆందోళనకు దిగారు.
న్యాయం చేయాలని రైతుల అర్ధనగ్న ఆందోళన
నాంపల్లి, జూలై 24: తాము అమ్మిన ధాన్యం కంటే తక్కువగా డబ్బులు అకౌంట్లలో జమ అవుతాయన్నాయని గుర్తించిన రైతులు నాంపల్లి మండలకేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట శనివారం అర్ధనగ్న ఆందోళనకు దిగారు. కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలోని సుంకిశాల గ్రామనికి చెందిన రైతు నేతళ్ళ ఇంద్రమ్మ పీఏసీఎస్లో క్వింటల్కు రూ.1,885ల చొప్పున జూన్ 7వ తేదీన 80క్వింటాళ్ల ధాన్యం అమ్మిందని తెలిపారు. మొత్తం రూ.1,54,180లు రావాల్సి ఉండగా, జూలై 20వ తేదీన ఆమె బ్యాంక్ అకౌంట్లో రూ.1,35,180 మాత్రమే జమ అయ్యాయని తెలిపారు. విషయం తెలుసు కున్న డీటీ స్వప్న రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు నేతళ్ళ ఇంద్రమ్మ, నేతళ్ళ రాములు, నారోజు రామచారి, మేగావత్ రాములు, కొత్తగొల్ల రాములు, యాదయ్య, మల్లయ్య పాల్గొన్నారు.