దుకాణాల్లో కస్టమ్స్ అధికారుల దాడులు
ABN , First Publish Date - 2022-08-08T04:42:21+05:30 IST
తిరుపతికి చెందిన సెంట్రల్ కస్టమ్స్ అధికారులు ఆదివారం మదనపల్లెలోని పలు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ముఖ్యంగా నిషేధిత సామగ్రి సహా బంగారు విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించి, నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు కస్టమ్స్ ఇన్స్పెక్టర్ రఘునందన్ చెప్పారు.
మదనపల్లె క్రైం, ఆగస్టు 7: తిరుపతికి చెందిన సెంట్రల్ కస్టమ్స్ అధికారులు ఆదివారం మదనపల్లెలోని పలు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ముఖ్యంగా నిషేధిత సామగ్రి సహా బంగారు విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించి, నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు కస్టమ్స్ ఇన్స్పెక్టర్ రఘునందన్ చెప్పారు. అలాగే ఇకపై దాడులను వేగవంతం చేసి అక్రమార్కుల ఆట కట్టిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కస్టమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.