మొదలైన కరెంట్ కోతలు
ABN , First Publish Date - 2022-01-21T05:05:10+05:30 IST
వేసవి రాకుండానే విద్యుత్ ట్రాన్స్కో ప్రజలకు కరెంటు కోతలు మొదలు పెట్టింది. గురువారం ఒక్కరోజే తాడేపల్లిగూడెం, పరిసర ప్రాంతాల్లో కరెంటు కోతలు విధించారు.
తాడేపల్లిగూడెం రూరల్, జనవరి 20: వేసవి రాకుండానే విద్యుత్ ట్రాన్స్కో ప్రజలకు కరెంటు కోతలు మొదలు పెట్టింది. గురువారం ఒక్కరోజే తాడేపల్లిగూడెం, పరిసర ప్రాంతాల్లో కరెంటు కోతలు విధించారు. ఉదయం రెండు గంటల పాటు కోత విధించిన ట్రాన్స్కో శాఖ సాయం 5.30 నుంచి రెండు గంటపాటు కరెంటు కోతలు విధించారు. దీనిపై తాడేపల్లిగూడెం ట్రాన్స్కో డీఈ అప్పారావును సంప్రదించగా లోడ్ రిలీఫ్ కోసం విశాఖపట్నం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు గంటలపాటు విద్యుత్ కోతలు ఉంటాయని వివరించారు.