కల్వర్టు పనులు వేగంగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-10-01T07:45:00+05:30 IST
42వ డివిజన్ పరిధిలో జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అధికారులను ఆదేశించారు. బుధవారం డివిజన్లో ఎమ్మెల్యే,
ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 30: 42వ డివిజన్ పరిధిలో జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అధికారులను ఆదేశించారు. బుధవారం డివిజన్లో ఎమ్మెల్యే, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసు పర్యటించారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున్న స్థానికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని సంబం ధిత అధికారులను ఆదేశించారు.
కిందికి వేలాడుతూ ప్రమాదభరితంగా మారిన విద్యుత్ తీగలను తొలగించాలని సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటు లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసు కుంటామని వాసు చెప్పారు. కార్యక్రమంలో డోకల అప్పారావు, రషీద్, కెవి శ్రీనివాస్ బాల, అప్పల రాజు, ఇంజేటి రాజబాబు, మట్టా శివ తదితరులు పాల్గొన్నారు.