Madhya Pradesh వైద్య విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-18T16:18:42+05:30 IST

హోలి సందర్భంగా మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

Madhya Pradesh వైద్య విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

హోలీ రోజున నీటి పొదుపు సందేశాలపై ఆగ్రహం

భోపాల్: హోలి సందర్భంగా మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.హోలీ రోజున నీటి పొదుపు సందేశాలపై మంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. దేశంలో కొంతమంది సాంస్కృతిక ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. హిందువుల పండుగల సమయంలో మాత్రమే పర్యావరణం గురించి మాట్లాడి సాంస్కృతిక ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని సారంగ్ ఆరోపించారు.హిందూ మతం పండుగలలో మాత్రమే పర్యావరణం గురించి మాట్లాడటం సాంస్కృతిక ఉగ్రవాదం అని ఆయన అన్నారు.ఇలాంటి సందేశాలను ప్రచారం చేయడం ద్వారా మన యువతను హిందూ పండుగల నుంచి దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని విశ్వాస్ సారంగ్ అన్నారు.



‘‘హోలీ రోజున నీటి పొదుపు అని మాట్లాడే వారు తమ కారు మెరిసిపోవడానికి ఇంత నీటిని వృధా చేస్తారు. ముందు తమను తాము సరిదిద్దుకోవాలి. పండుగల్లోనే ఇలాంటివి ఎందుకు వస్తాయి? పర్యావరణం పేరుతో ఈ వ్యక్తులు మన హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు’’ అని మంత్రి అన్నారు.

Updated Date - 2022-03-18T16:18:42+05:30 IST