ప్రతిభను వెలికి తీయడానికే సాంస్కృతిక పోటీలు
ABN , First Publish Date - 2022-06-29T05:35:17+05:30 IST
పాఠశాల స్థాయి నుండే చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీటీ విశాలాఫెర్రర్ అన్నారు.
ఆర్డీటీ మహిళా సెక్టార్ డైరెక్టర్ విశాలా ఫెర్రర్
బుక్కరాయసముద్రం, జూన28: పాఠశాల స్థాయి నుండే చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీటీ విశాలాఫెర్రర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆర్డీటీ బధిరిల పాఠశాలలో సెంట్రల్ లెవెల్ బాలల సంగీత, నాట్యకళాఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విశాలా ఫెర్రర్ మాట్లాడుతూ సామాజిక చైతన్యాన్ని పెంచడానికి, మానవ సంబంధాలను మెరుగు పరచడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. తొలి రోజు పలువురు చిన్నారులు ఆలపించిన సినీగేయాలు, జానపదగేయాలు ఆకట్టుకున్నాయి. బుధవారం నృత్యపోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీటీ డైరెక్టర్లు దశరథ్, నారాయణరెడ్డి, కృష్ణవేణి రఫీక్, హెచఎం ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.