వ్యవసాయ పనులు ప్రారంభించాలి
ABN , First Publish Date - 2022-05-24T06:45:01+05:30 IST
పంట కాలువలకు జూన్ 1న సాగునీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులు త్వరితగతిన వ్యవసాయ పనులను ప్రారంభించాలని ఆలమూరు ఏడీఏ సీహెచ్కేవీ చౌదరి అన్నారు.
కపిలేశ్వరపురం, మే 23: పంట కాలువలకు జూన్ 1న సాగునీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులు త్వరితగతిన వ్యవసాయ పనులను ప్రారంభించాలని ఆలమూరు ఏడీఏ సీహెచ్కేవీ చౌదరి అన్నారు. సోమవారం టేకి, తాతపూడి రైతుభరోసా కేంద్రాల వద్ద ఖరీఫ్ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. టేకిలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సొసైటీ చైర్పర్సన్ ఎం.పాల్రాజు, సర్పంచ్ కుక్కల నాగమణి, మేడిశెట్టి దుర్గారావు, ఉమ్మిడిశెట్టి సూరిబాబు, పెద్దిరెడ్డి వెంకటేశ్వర్లు, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.