సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-10-05T04:03:50+05:30 IST
కొన్నేళ్లుగా సాగులో ఉన్న రైతులందరికీ భూపంపిణీలో పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన
పెనుకొండ టౌన, అక్టోబరు 4: కొన్నేళ్లుగా సాగులో ఉన్న రైతులందరికీ భూపంపిణీలో పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం సాగురైతులతో కలిసి సబ్ కలెక్టర్ కా ర్యాలయం ఎదుట బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ భూమిలేని నిరుపేదలు ప్రభుత్వ భూములను గుర్తించి సాగుచేసుకుని పంటలు పెట్టుకుంటున్నారన్నారు. గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పట్టాలు మంజూరు చేయాలని విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఎనిమిదో విడత భూపంపిణీలో అర్హులందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. నిరసనలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, ఫకృద్దీన, హనుమయ్య, గంగాధర్, రంగప్ప, వెంకటేశులు పాల్గొన్నారు.