ఆవుల రామన్న కుటుంబాన్ని ఆదుకుంటాం

ABN , First Publish Date - 2022-05-17T06:58:14+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆవుల రామన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆవుల రామన్న మిత్రులు ఏర్పాటు చేసిన సంతాప సభలో వారు మాట్లాడారు. అంతకముందు ఆయన చిత్రప

ఆవుల రామన్న కుటుంబాన్ని ఆదుకుంటాం
రామన్న చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు

నల్లగొండ టౌన్‌, మే 16 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆవుల రామన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆవుల రామన్న మిత్రులు ఏర్పాటు చేసిన సంతాప సభలో వారు మాట్లాడారు. అంతకముందు ఆయన చిత్రపటానికి వారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అకాల మృతి చెందిన రామన్న భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్‌ నగరంలో నిర్వహించే సదరు సమ్మేళనాన్ని నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిం చిన ఘనత ఆవుల రామన్నకే దక్కిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ యువకులకు ఏ సమస్య వచ్చిన్నా ఆవుల రామన్న ముందుండి సమస్యను పరిష్కరించేవారన్నారు.ఈ సందర్భంగా రూ.50వేల నగదు ను ఆయన రామన్న సతీమణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్‌, కౌన్సిలర్లు ఊట్కూరు వెంకట్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, పంకజ్‌ యాదవ్‌, గోపాలకృష్ణయా దవ్‌, దూదిమెట్ల సత్తయ్య యాదవ్‌, అల్లి వేణుయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:58:14+05:30 IST