Dubai ఫైవ్స్టార్ రిసార్ట్లో ఎంఎస్ ధోని దంపతుల క్రిస్మస్ సందడి
ABN , First Publish Date - 2021-12-22T14:58:05+05:30 IST
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టు కెప్టెన్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులను తన కుటుంబంతో కలిసి దుబాయ్లో గడుపుతున్నారు...
దుబాయ్ : చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టు కెప్టెన్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులను తన కుటుంబంతో కలిసి దుబాయ్లో గడుపుతున్నారు. దుబాయ్లోని పామ్ జుమేరాలో ఉన్న ఫైవ్ స్టార్ రిసార్ట్లో ధోనీ భార్య సాక్షి తన కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు.ధోని, అతని భార్య సాక్షి సింగ్, కుమార్తె జీవాలు ఇటీవల జైపూరు నగరంలో జరిగిన ప్రఫుల్ పటేల్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. తన ఇన్స్టాగ్రామ్లో పలు చిత్రాలను సాక్షి తన అభిమానులతో పంచుకున్నారు.దుబాయ్లోని పామ్ జుమేరాలో ఉన్న ఒక విల్లాలో ధోనీ కుమార్తె జీవా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఓ చిత్రాన్ని షేర్ చేశారు.
దుబాయ్ దేశంలో ధోని కుటుంబం బస చేసిన లగ్జరీ విల్లా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ధోనీ కుటుంబం బస చేసిన పామ్ జుమేరా చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. చెన్నై ప్రేక్షకుల ముందు తన చివరి ఐపీఎల్ గేమ్ ఆడాలనుకుంటున్నట్లు ధోనీ ఇప్పటికే ప్రకటించారు.