ధోనీ ఫాంహౌస్‌లో కొత్తగా ‘చేతక్’ పేరిట గుర్రం

ABN , First Publish Date - 2021-05-08T17:11:35+05:30 IST

ఐపీల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని తన ఫాంహౌస్ లో కొత్తగా బ్లాక్ స్టాలియన్ గుర్రాన్ని...

ధోనీ ఫాంహౌస్‌లో కొత్తగా ‘చేతక్’ పేరిట గుర్రం

రాంచీ ( జార్ఖండ్):ఐపీల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని తన ఫాంహౌస్ లో కొత్తగా బ్లాక్ స్టాలియన్ గుర్రాన్ని తీసుకువచ్చారు.ఐపీఎల్ వాయిదాతో చెన్నై నుంచి గురువారం సాయంత్రం రాంచీకి తిరిగి వచ్చిన ధోని రాంచీ శివార్లలోని తన ఫాం హౌస్ కు తీసుకువచ్చిన గుర్రపు ఫొటోను ధోని భార్య సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ‘‘మా ఇంటికి చేతక్ కు స్వాగతం’’ అంటూ సాక్షి గుర్రంతో కూడిన వీడియోను పోస్టు చేశారు. ధోని తన ఫాం హౌస్ లో బెల్జియన్ మాలినోయిస్, తెల్లటి హస్కీ, జర్మన్ షెపర్డ్ జాగిలాలున్నాయి. రవీంద్ర జడేజా తర్వాత పెంపుడు గుర్రాన్ని ఫాంహౌస్ కు తీసుకువచ్చిన రెండవ క్రికెటరుగా ధోని నిలిచారు.

Updated Date - 2021-05-08T17:11:35+05:30 IST