స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్‌

ABN , First Publish Date - 2021-08-12T00:42:44+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్‌

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం గోల్కొండ కోటను సందర్శించిన సీఎస్‌ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం 10.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. పోలీసుశాఖ, జీహెచ్‌ఎంసి, ఆర్‌అండ్‌బి, ఐ అండ్‌ పీఆర్‌, కల్చరల్‌, రెవెన్యూ శాఖలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. 


ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టంగా జరగాలని అధికారులను ఆదేశించారు. సెక్యూరిటీ, ట్రాఫిక్‌ వంటి సమస్యలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సునీల్‌శర్మ, విద్యుత్‌శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జీహెచ్‌ఎంసి కమిషర్‌ లోకేశ్‌ కుమార్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-08-12T00:42:44+05:30 IST