ఉద్యోగుల కేటాయింపుపై సీఎస్ సమావేశం

ABN , First Publish Date - 2021-12-21T00:50:59+05:30 IST

తెలంగాణలో ఉద్యోగుల కేటాయింపు కోసం జారీ చేసిన జీవో.317పై సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం పలువురు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఉద్యోగుల కేటాయింపుపై సీఎస్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగుల కేటాయింపు కోసం జారీ చేసిన జీవో.317పై సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం పలువురు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ఆయాశాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ కేటాయింపులో అన్నిస్థాయిల్లో ఉద్యోగుల ఆప్షన్లను తీసుకోవాలని సూచించారు. సీనియారిటీ జాబితాను కూడా సిద్ధం చేయాలని అన్నారు. 


ఉద్యోగుల కేటాయింపులో వారి పనితీరు, సాధించిన ప్రగతిని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిగణలోకితీసుకోనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య, మహిళా,శిశు, యూత్ అడ్వాన్స్ మెంట్, టూరిజం, కల్చర్, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్, పోలీస్, పంచాయితీరాజ్, మున్సిపల్ పరిపాలన, విద్యుత్, ఫారెస్ట్, అగ్రికల్చర్, రవాణా, రోడ్లు, భవనాల శాఖల నుంచి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-21T00:50:59+05:30 IST