ఈ నెల మూడో వారం నుంచి పోడు భూముల పై దరఖాస్తుల స్వీకరణ: సీఎస్

ABN , First Publish Date - 2021-10-13T21:43:14+05:30 IST

రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కై పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు అక్టోబరు మూడో వారం నుంచి

ఈ నెల మూడో వారం నుంచి పోడు భూముల పై దరఖాస్తుల స్వీకరణ: సీఎస్

హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కై పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు అక్టోబరు మూడో వారం నుంచి దరఖాస్తులను స్వీకరించన్నట్టు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో విధి విధానాలు రూపొందించేందుకు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సి.సి.ఎఫ్. శోభ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమీషనర్ శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా, తెలంగాణా టెక్నాలాజికల్ సర్వీసెస్ ఎం.డి. వెంకటేశ్వర్ రావు తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 


ఈ సందర్బంగా సి.ఎస్. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, అక్టోబర్ మూడో వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని సి.ఎం. కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. దీనికి సంబంధించి విధి విధానాలు, దరఖాస్తు ఏ విధంగా ఉండాలి, దరఖాస్తులో పొందు పరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినెట్స్ నిర్ణయం, వివిధ స్థాయుల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్సర్వేటర్లు, డీ.ఎఫ్.ఓ లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

Updated Date - 2021-10-13T21:43:14+05:30 IST