ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలను ఏర్పాటు చేయండి: సీఎస్‌

ABN , First Publish Date - 2021-10-28T09:45:36+05:30 IST

పోడు భూముల దరఖాస్తులు స్వీకరించే ముందు పంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శి, ప్రజాప్రతినిధు లు, ఇతర సభ్యులతో..

ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలను ఏర్పాటు చేయండి: సీఎస్‌

పోడు భూముల అంశంపై ఉన్నతాధికారులతో సమావేశం 

హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): పోడు భూముల దరఖాస్తులు స్వీకరించే ముందు పంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శి, ప్రజాప్రతినిధు లు, ఇతర సభ్యులతో ‘ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీ’లను ఏర్పాటు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు.  పోడుభూముల సమస్య పరిష్కారానికి నవంబరు 8నుంచి అర్హులైన పోడు రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరించాలనే అంశంపై సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలతో రైతులకు అవగాహన కల్పించాలని  సూచించారు. ఇకపై అటవీ భూముల ఆక్రమణ ఉండదని గ్రామస్తులు అంగీకరించే విధంగా చైతన్యం చేయాలన్నారు. పోడు సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో పరిష్కారానికి ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు.  

Updated Date - 2021-10-28T09:45:36+05:30 IST