ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

ABN , First Publish Date - 2020-07-11T12:13:15+05:30 IST

ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

హైదరాబాద్: నగరంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతపై సీఎస్ సోమేష్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లాక్ మార్కెటింగ్ వళ్ల ఆసుపత్రులకు కొరత వస్తోందన్న ఫిర్యాదులపై చర్చించారు. ఆసుపత్రులు, డీలర్ల వద్ద ఆక్సిజన్ సిలిండర్ల వినియోగాన్ని పరిశీలించేందుకు సంయుక్త బృందాలను ఏర్పాటు చేశారు. డ్రగ్ కంట్రోలర్ అథారిటీ, హైదరాబాద్ పోలీస్  టాస్క్ ఫోర్స్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజివ్స్‌లతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు క్రయోజనిక్  లిక్విడ్ ఆక్సిజన్ వెసెల్స్‌ను ఉపయోగించాలని  ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగిందని, రెండు కేసులను కూడా నమోదు చేసినట్లు  పోలీస్ కమిషనర్ తెలిపారు. 

Updated Date - 2020-07-11T12:13:15+05:30 IST