ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి: somesh kumar

ABN , First Publish Date - 2021-08-25T17:00:12+05:30 IST

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి: somesh kumar

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. బుధవారం ఉప్పుగుడ పరిధిలోని పరివార్ కాలనీలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని సీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 100శాతం అర్హులైన వారికి చేపట్టిన కొవిడ్ వ్యాక్సిన్  కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. పదిరోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని.. అవసరమైతే పొడగిస్తామని చెప్పారు. దేశంలోని ఏ మెట్రో నగరాల్లో ఇంత పెద్ద స్థాయిలో మెగా వ్యాక్సినేషన్  ప్రోగ్రాం నిర్వహించలేదన్నారు. ఇళ్లలో ఇంకా మిగిలిన వారికే ఈ ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో చేపట్టామని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-25T17:00:12+05:30 IST