అందుకే నేను వ్యాక్సిన్ వేసుకోలేదు: సీఎస్ సోమేష్ కుమార్

ABN , First Publish Date - 2021-01-16T18:44:35+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని సీఎస్ సోమేష్‌ కుమార్ తెలిపారు.

అందుకే నేను వ్యాక్సిన్ వేసుకోలేదు: సీఎస్ సోమేష్ కుమార్

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని సీఎస్ సోమేష్‌ కుమార్ తెలిపారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌లో ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తలేదన్నారు. నేడు ప్రతి కేంద్రంలో 30 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. సోమవారం నుంచి దశల వారీగా ఎక్కువ మందికి ఇస్తామన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన సూచనల ప్రకారం తాను వ్యాక్సిన్ వేసుకోలేదని...లేకుంటే తానే ముందుగా వేసుకొని అపోహలు దూరం చేసే వాడినని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-16T18:44:35+05:30 IST