‘రెండో డోసు వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ వేయించుకోవాలి’
ABN , First Publish Date - 2021-10-30T21:53:18+05:30 IST
నగరంలోని రాజేంద్ర నగర్లో మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సీఎస్ సోమేష్కుమార్ పరిశీలించారు. కరోనా రెండో డోసు వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ వేయించుకోవాలని ఆయన సూచించారు.
హైదరాబాద్: నగరంలోని రాజేంద్ర నగర్లో మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సీఎస్ సోమేష్కుమార్ పరిశీలించారు. కరోనా రెండో డోసు వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ వేయించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేశామని తెలిపారు. హైదరాబాద్లో 90 శాతం పౌరులకు వ్యాక్సిన్ పంపిణీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ పేర్కొన్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు 150 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు.