సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎస్ సమీర్శర్మను కలిసి రిపోర్ట్ చేశా: ఏబీ వెంకటేశ్వరరావు
ABN , First Publish Date - 2022-04-30T00:06:57+05:30 IST
సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎస్ సమీర్శర్మను కలిసి రిపోర్ట్ చేశా: ఏబీ వెంకటేశ్వరరావు
అమరావతి: ఏపీ సచివాలయానికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లారు. యూనిఫాంలో ఏబీ వెంకటేశ్వరరావు సెక్రటేరియట్కు వచ్చారు. సీఎస్ సమీర్శర్మను కలిసినట్లు ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఏబీవీ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీఎస్కు రిపోర్ట్ చేశానని, పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన వెల్లడించారు. అవసరమైన ఆదేశాలివ్వాలని సీఎస్ను కోరానని, లెటర్ ఇచ్చానని.. పోస్టింగ్ విషయం ప్రాసెస్లో పెడతారని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.