సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు
ABN , First Publish Date - 2021-11-29T00:18:20+05:30 IST
సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగించారు. సమీర్ శర్మకు పదవీకాలాన్ని మరో 6 నెలల పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగించారు. సమీర్ శర్మకు పదవీకాలాన్ని మరో 6 నెలల పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30తో సీఎస్ పదవీకాలం ముగియనుంది. 2022 మే 31 వరకు సీఎస్గా సమీర్ శర్మ కొనసాగుతారు. 6నెలల పాటు పదవీకాలం పొడిగించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ యూనియన్ సెక్రెటరీ సంబంధిత ఉత్తర్వులను జారీచేశారు. రెండు నెలల క్రితం ఏపీకి సీఎస్గా సమీర్శర్మ బాధ్యతలు స్వీకరించారు.