మౌలిక సదుపాయాల పురోగతిపై సీఎస్ సమీక్ష

ABN , First Publish Date - 2021-08-08T00:38:00+05:30 IST

రాష్ట్రంలో వైద్య, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో తీసుకునే

మౌలిక సదుపాయాల పురోగతిపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో తీసుకునే పురోగతిపై బీఆర్కే భవన్‌లో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సీఎస్‌ ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, అదనపు అంతస్తుల నిర్మాణ పనుల ప్రగతిని సీఎస్ అడిగి తెలుసుకున్నారు. అన్ని బోధన, జిల్లా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్, ఐసీయూ పడకలను పెంచాలని అధికారులను సోమేశ్ కుమార్  కోరారు.  

Updated Date - 2021-08-08T00:38:00+05:30 IST