ధాన్యం కొనుగోలుపై సీఎస్ సమీక్ష

ABN , First Publish Date - 2021-11-28T00:08:37+05:30 IST

వరి ధాన్యం కొనుగోలుపై సీఎస్ సమీక్ష చేశారు. బీఆర్కే

ధాన్యం కొనుగోలుపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలుపై సీఎస్ సమీక్ష చేశారు. బీఆర్కే భవన్‌లో వరి ధాన్యం కొనుగోలుపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లాల సివిల్ సప్లై అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడంతో పాటు ధాన్యం తడవకుండా టార్పలిన్ సంచుల సరఫరాపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లతో పాటు గోనె సంచులను రైతులకు అందజేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 



Updated Date - 2021-11-28T00:08:37+05:30 IST