కార్యదర్శులతో సీఎస్ సమావేశం

ABN , First Publish Date - 2021-12-22T22:25:05+05:30 IST

సచివాలయం మొదటి బ్లాకు సీఎం సమావేశ మందిరంలో

కార్యదర్శులతో సీఎస్ సమావేశం

అమరావతి: సచివాలయం మొదటి బ్లాకు సీఎం సమావేశ మందిరంలో సీఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరుగుతోంది. సమావేశంలో ప్రధానంగా గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై తీసుకున్న చర్యల నివేదిక (ఏటీఆర్)పై సమీక్ష చేస్తున్నారు. వివిధ పెండింగ్ కోర్టు కేసుల అంశాలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వచ్చిన వివిధ ఆర్థిక, ఆర్థికేతర అంశాలపైన చర్చ జరుగుతోంది. శాఖల వారీగా తీసుకోవాల్సిన, పరిష్కారించాల్సిన అంశాలపై కార్యదర్శులతో  సీఎస్ సమీక్షిస్తున్నారు. శాఖల వారీగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి వీలున్నంత వరకూ ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు కూడా జిల్లా స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలను పరిష్కరించాలని సీఎస్ అదేశించారు. 


Updated Date - 2021-12-22T22:25:05+05:30 IST