పరిటాల రవి పేరిట ఉన్న శిలాఫలకాలు ధ్వంసం

ABN , First Publish Date - 2020-06-03T20:55:05+05:30 IST

రాప్తాడు నియోజకవర్గం పెరూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పరిటాల రవి పేరిట ఉన్న శిలాఫలకాలు ధ్వంసం

అనంతపురం జిల్లా: రాప్తాడు నియోజకవర్గం పెరూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు హయాంలో వేసిన శిలాఫలకాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. పరిటాల రవి పేరుతో గతంలో వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఘటనాస్థలికి పరిటాల సునీత చేరుకున్నారు. పెరూరికి టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారపార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిన్న రాత్రి గుర్తుతెలియను వ్యక్తులు శిలాఫలకాలు ధ్వంసం చేశారు. కక్షపూరితంగా గ్రామాల్లో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే శిలాఫలకాలు ధ్వంసం చేశారని సునీత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు.

Updated Date - 2020-06-03T20:55:05+05:30 IST