క్రిప్టో పతనం

ABN , First Publish Date - 2021-11-26T00:19:53+05:30 IST

క్రిప్టో కరెన్సీ రద్దు వార్తల నేపధ్యంలో బిట్ కాయిన్, ఎథేరియం సహా అన్ని క్రిప్టోలు భారీగా పతనమయ్యాయి.

క్రిప్టో పతనం

న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ రద్దు వార్తల నేపధ్యంలో బిట్ కాయిన్, ఎథేరియం సహా అన్ని క్రిప్టోలు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు తమ చేతుల్లోని క్రిప్టోను విక్రయించి సొమ్ము చేసుకుంటన్నారు. అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ ఓ సమయంలో 56 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 56,500 డాలర్లకు సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఎథేరియం 4281 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ నెల 29 న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అప్పుడు కేంద్రం క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021 సహా  26 బిల్లులను లోకసభ ముందుకు రానున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ పలుమార్లు క్రిప్టోపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే క్రిప్టో పైన కేంద్రం కఠిన రెగ్యులేషన్స్ తీసుకు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. 

Updated Date - 2021-11-26T00:19:53+05:30 IST