సీఎస్ సోమశ్ కుమార్ తో క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ

ABN , First Publish Date - 2022-04-28T23:51:29+05:30 IST

తెలంగాణ క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం బి. ఆర్. కె.ఆర్. భవన్ లో ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో భేటీ అయ్యారు

సీఎస్ సోమశ్ కుమార్ తో క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్: తెలంగాణ క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం బి. ఆర్. కె.ఆర్. భవన్ లో ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు.క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు. ఇటీవల కలంలో భవన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సిమెంట్, ఇసుక ధరలుపెరిగిన నేపధ్యంలో క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎస్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్,  మైన్స్ & జియాలజీ జాయింట్ డైరెక్టర్ (ఎఫ్ఏసీ) వెంకటేశ్వర్లు, మైన్స్ & జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ స్వామి కృష్ణారావు, మైన్స్ & జియాలజీ కన్సల్టెంట్  నిరంజన్, అసోసియేషన్ సభ్యులు  కమలాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నంద రెడ్డి,  పి.ఎం. కుమార్, శ్రీ తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-28T23:51:29+05:30 IST