వదలా బొమ్మాళీ.. సముద్రంపై ఉన్నా సోకిన కరోనా

ABN , First Publish Date - 2020-07-15T07:48:29+05:30 IST

ఆ నావికులకు కరోనా ఎలా సోకిందనే దానిపై అర్జెంటీనా తల పట్టుకుంటోంది. ఎకియన్‌ మారు అనే చేపలు పట్టే నౌక ఒకటి 61మంది సిబ్బందితో ఉషుయా నౌకాశ్రయం నుంచి బయలుదేరింది...

వదలా బొమ్మాళీ.. సముద్రంపై ఉన్నా సోకిన కరోనా

  • తల పట్టుకుంటున్న అర్జెంటీనా


టియెర్రా, జూలై 14: ఆ నావికులకు కరోనా ఎలా సోకిందనే దానిపై అర్జెంటీనా తల పట్టుకుంటోంది.  ఎకియన్‌ మారు అనే చేపలు పట్టే నౌక ఒకటి 61మంది సిబ్బందితో ఉషుయా నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. ఆ సమయంలో వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా నెగిటివ్‌ వచ్చింది. 35 రోజులు సముద్రంపై ప్రయాణించిన నౌక.. టియెర్రా చేరుకుంది. సిబ్బంది అందరికీ మళ్లీ వైద్య పరీక్షలు చేయగా.. ఏకంగా 57మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారు సముద్రంపై ఉన్నప్పటికీ కరోనా బారిన ఎలా పడ్డారనే చిక్కుముడిని విప్పేందుకు అర్జెంటీనా అన్వేషణ ప్రారంభించింది.


Updated Date - 2020-07-15T07:48:29+05:30 IST