పెంపుడు జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టాలి
ABN , First Publish Date - 2021-07-04T00:42:03+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెంపుడు జంతువులపై జరుగుతున్న క్రూరత్వాన్ని
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెంపుడు జంతువులపై జరుగుతున్న క్రూరత్వాన్ని అరికట్టాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ ఆదేశించారు. కుక్కల పెంపకం, అమ్మకం దారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు ఆయన సూచించారు. నగరంలోని కుక్కల పెంపకం, అమ్మకందారులు స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అర్వింద్కుమార్ పేర్కొన్నారు.