సీఆర్పీఎఫ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-03-01T06:30:49+05:30 IST
ఆదివాసీలు సీఆర్పీఎఫ్ జవాన్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాళ్లగెడ్డ 234 బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ అరుణ్ కుమార్ అన్నారు
అసిస్టెంట్ కమాండర్ అరుణ్ కుమార్
చింతపల్లి, ఫిబ్రవరి 28: ఆదివాసీలు సీఆర్పీఎఫ్ జవాన్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాళ్లగెడ్డ 234 బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నిమ్మపాడులో సివిక్ యాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఆర్పీఎఫ్ జవాన్లు కుటుంబ సభ్యులు, స్వగ్రామాలను విడిచి ఆదివాసీల భద్రత కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లు, ఆదివాసీలకు రేడియో, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో సీఆర్పీఎఫ్ వైద్యాధికారి సాయి సింధు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి.ముర్ముర్ పాల్గొన్నారు.