విజయనగరం చేరుకున్న జవాన్ జగదీష్ భౌతికకాయం
ABN , First Publish Date - 2021-04-06T02:12:35+05:30 IST
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాను రౌతు జగదీశ్(27) భౌతికకాయం విజయనగరం చేరుకుంది.
విజయనగరం: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాను రౌతు జగదీశ్(27) భౌతికకాయం విజయనగరం చేరుకుంది. మంగళవారం అధికార లాంఛనాలతో జగదీశ్ అంత్యక్రియలు నిర్వహించటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం పట్టణంలోని గాజులరేగ ఎగువవీధికి చెందిన రౌతు సింహాచలం, రమణమ్మ దంపతులకు కుమారుడు జగదీశ్కు మే 22న వివాహం నిర్ణయించారు. పెళ్లి పనులు చూసుకునేందుకు ఈ నెల 5న ఇంటికి వస్తానని జగదీశ్ రెండురోజల కిందటే తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పాడు. ఈలోగా ఘోరం జరిగిపోయింది. అంతలోనే పెళ్లింట తీవ్ర విషాదం అలముకుంది.