jammu and Kashmir: సీఆర్పీఎఫ్ పార్టీపై మిలిటెంట్ల గ్రెనెడ్ దాడి

ABN , First Publish Date - 2021-08-17T13:06:11+05:30 IST

జమ్మూకశ్మీరులోని కుప్వారా జిల్లాలో సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సుపై సోమవారం రాత్రి మిలిటెంట్ల గ్రెనెడ్ దాడి చేశారు....

jammu and Kashmir: సీఆర్పీఎఫ్ పార్టీపై మిలిటెంట్ల గ్రెనెడ్ దాడి

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని కుప్వారా జిల్లాలో సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సుపై సోమవారం రాత్రి మిలిటెంట్ల గ్రెనెడ్ దాడి చేశారు. కుప్వారా జిల్లాలోని మిడిల్ స్కూలు వద్ద సీఆర్ పీఎఫ్ బృందం గాలింపు జరుపుతుండగా, మిలిటెంట్లు గ్రెనెడ్లతో దాడి చేశారు. ఈ గ్రెనెడ్ దాడిలో ఓ సీఆర్ పీఎఫ్ జవాను గాయపడ్డారు. గాయపడిన జవాన్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఘటనలో బారాముల్లా పట్టణంలోని ఆజాద్ గంజ్ సమీపంలోని బస్టాప్ వద్ద పోలీసు పార్టీపై మిలిటెంట్లు గ్రెనెడ్లు విసిరారు. ఈ గ్రెనెడ్ రోడ్డు పక్కన పడింది.ఈ గ్రెనెడ్ దాడిలో ఎవరూ గాయపడలేదని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-08-17T13:06:11+05:30 IST