ఎయిరిండియా ప్రమాద ఘటన: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ విచారం !
ABN , First Publish Date - 2020-08-09T19:20:02+05:30 IST
కోజికోడ్ విమానం ప్రమాద ఘటనపై యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విచారం వ్యక్తం చేశారు.
అబుధాబి: కోజికోడ్ విమానం ప్రమాద ఘటనపై యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ఆయన... బాధిత కుటుంబ సభ్యులకు, ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడితో ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అలాగే ఇటీవల కేరళలో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన బాధితులకు కూడా తన సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు. ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో ఆయన ఈ ట్వీట్ చేయడం గమనార్హం.