అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలు
ABN , First Publish Date - 2021-04-16T05:16:47+05:30 IST
రెండు రో జులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నారాయణపేట జిల్లాలోని పలు మం డలంలో పంటలు దెబ్బతిన్నాయి.
నారాయణపేట క్రైం/మరికల్/ధన్వాడ/మద్దూర్, ఏప్రిల్ 15 : రెండు రో జులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నారాయణపేట జిల్లాలోని పలు మం డలంలో పంటలు దెబ్బతిన్నాయి. మరికల్ మండలంలోని పల్లెగడ్డ, పూసల్ పహాడ్, రాకొండ గ్రామాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. అలాగే ఆరబెట్టి ఉల్లిగడ్డ పూర్తిగా తడిసిపోయింది. ధన్వాడలో కందూర్ శ్రీనివాస్రెడ్డికి చెం దిన వరి పంట నేలకొరిగింది. మద్దూరు మండలం చత్ర్యానాయక్తండాలో వర్షానికి రోడ్డు జలమయమైంది. జిల్లాలో అత్యధికంగా మరికల్లో 41.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మక్తల్లో 7.0 మి.మీ, వర్షపాతం నమోదైంది.