పంట నమోదు విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-08-11T04:36:43+05:30 IST
వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది పంటల నమోదును విజయవంతం చేయాలని ఏడీఏ నరసింహారెడ్డి తెలిపారు.
కమలాపురం రూరల్, ఆగస్టు 10: వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది పంటల నమోదును విజయవంతం చేయాలని ఏడీఏ నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయ భవనంలో కమలాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది కి పంట నమోదు జాయింట్ అజమాయిషీ మీద అవగాహన ఏర్పాటు చేశా రు. ఖరీప్ సీజన్కు పంట నమోదు రెవెన్యూ, వ్యవసాయశాఖ జాయింట్ అజమాయిషీలో జరుగుతుందని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా పంట వేసిన ప్రతి రైతుకు ఈక్రాప్ యాప్లో పంట నమోదు చేయాలని కోరారు. పంట నమోదు చేయించుకుంటే రైతు భరోసా, పెట్టుబడి రాయితీ, పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు వంటి పథకాలు లబ్ధిపొందవచ్చన్నారు. కమలాపురం తహసీల్దార్ అమరేశ్వరి, వ్యవసాయాధికారి సరస్వతి, ఏఈఓ పాల్గొన్నారు.